గిరిజన గ్రామాలైన గాడిదపాయ, తాడిపాయలో జనసైనికుల పర్యటన

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం, సీతంపేట మండల జనసైనికులు ప్రతి గ్రామంలో సందర్శన సందర్భంగా కొండప్రాంతాల్లో ఉంటున్న, గిరిజన గ్రామాలైన గాడిద పాయ, తాడి పాయ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన యొక్క సిద్ధాంతాలను మరియు అదే పార్టీ బలోపేతం కోసం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విశ్వనాథం, ఉపేంద్ర, ప్రవీణ్, దుర్గారావు, హరీష్, జనసైనికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.