ఛత్రపతి శివాజీ జాతీయ సేవాపురస్కార్ అవార్డు తీసుకున్న సారె ఓబులేసు నాయుడు

హైదరాభాద్ లోని కుత్భుల్లాపూర్, రంగారెడ్డినగర్ లో చత్రపతి శివాజి విగ్రహం దగ్గర శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, ఛత్రపతి శివాజీ జాతీయ సేవాపురస్కార్, అవార్డు తీసుకోవడం జరిగింది. కొమరోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ సారె జనసేవ చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కూడా పేద విద్యార్థులకు విద్యార్థినులకు డ్రెస్సులు బూట్లు టై బెల్ట్ ఇప్పించడమే కాకుండా వారు కూర్చోడానికి బెంచీలు కూడా వేయించి ఇది గవర్నమెంట్ స్కూల్ ఆ ప్రైవేట్ స్కూల్ ఆ అన్న విధంగా చేసిన ఘనత ఓబ్లేస్ నాయుడు కి దక్కుతుంది. ఇదే కాకుండా పేదలకు అండగా నిలుస్తూ… నిత్యావసర సరుకులు అవసరమైతే పేదవారికి సమకూర్చి శభాష్ అనిపించుకున్న జనసేవ చారిటబుల్ ట్రస్ట్ కు అధ్యక్షుడిగా ఉండటం నా అదృష్టం అని ఓబులేసు నాయుడు అన్నారు.