జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు

పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా సోమవారం రాత్రి నిడమానూరు మస్జీద్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి జనసైనికునికి, ముస్లిం సోదరులకు నిడమానూరు జనసేన తరపున పేరు పేరునా.. ధన్యవాదాలు తెలియజేసారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో సర్వ మత సౌబ్రాతృత్వం చాటుతున్న జనసైనికులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసారు.