Nuzividu: ఆశా వర్కర్స్ మరియు ANM లను సన్మానించిన నూజివీడు జనసేన

నూజివీడు జనసేనపార్టీ, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తరపున నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో ఎన్నో సేవలు అందించిన రమణక్కపేట హాస్పిటల్ పరిధిలో గల ఆశా వర్కర్స్, ANM ని 100 కోట్ల వాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా వారి సేవలు మెచ్చుకుంటూ సన్మానించి స్వీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వేట త్రినాద్, నాగం సాయి, ఉప్పే వంశీ, చేకూరి కిషోర్, గుండాల శివ, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది మరియు జనసైనికులు పాల్గొన్నారు.