వారాహి అమ్మవారి నవరాత్రులు – ఉపవాస దీక్షలో పవన్ కళ్యాణ్

నేటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష ఆచరించనున్నారు. ఉపవాస దీక్షను నవరాత్రులు చివరి మూడు రోజులు ఆచరించాలని తొలుత భావించారు. అయితే మంగళవారం నుంచే దీక్షను ప్రారంభించనున్నారు. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగిస్తారు. వచ్చే నెల గురుపౌర్ణమి నాటినుంచి చాతుర్మాస దీక్ష కూడా ఎప్పటిలాగే ఆచరించనున్నారు. అందువల్ల ఈ ఉపవాస దీక్షను కార్తీక మాసాoతం వరకు కొనసాగించనున్నారు. దీక్షా కాలంలో పాలు, ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.లోక కల్యాణార్థం ఇటీవల మంగళగిరిలో మహాయాగం నిర్వహించిన నాటినుంచి ఆయన శాకాహారానికి మాత్రమే పరిమితమయ్యారు.