నా సేన కోసం నా వంతు కార్యవర్గ సభ్యునిగా వరికూటి సురేష్

కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు సోదరులు, జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ వ్యవస్థాపకులు మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ వరకూటి సురేష్ ను గురువారం జనసేన పార్టీ ప్రకటించిన నా సేన నా వంతు కార్యవర్గ కమిటీలో ఎన్ఆర్ఐ విభాగం నుంచి సభ్యునిగా నియమించారు, వరికూటి సురేష్ జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ జనసేన పార్టీ ఎన్నారై విభాగంలో పార్టీకి సంబందించిన అన్ని కార్యక్రమంలో ముందుండి చురుగ్గా పాల్గొంటూ, మరియు యూరప్ దేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటనలో ముందుండి విజయవంతం చేశారు. అంతే కాకుండా రెండు నెలల క్రితం ఎన్నారై సభ్యులందరినీ ఐక్యం చేసి అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి భారీ మొత్తంలో పార్టీకి ఆర్థికంగా ఎన్నారైల ద్వారా ఫండ్ ఇవ్వడం జరిగింది. మరియు జనసేన గ్లోబల్ టీం ద్వారా ప్రపంచ నలుమూలల ఎన్నారై లను ఏకతాటి మీదకు తీసుకొచ్చేలా ఒక వేదికను ఏర్పరచి, జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ పార్టీకి విధేయులుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా వరికూటి అభిమానులు, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.