వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ కు హాజరైన డా. పసుపులేటి

హైదరాబాద్: హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో ఆదివారం ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ రిసెప్షన్ లో మెగా ఫ్యామిలీలోని ప్రముఖులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను ఆత్మీయంగా పలకరించారు.