వాసిరెడ్డి పద్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి: గంగారపు స్వాతి

మదనపల్లె: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ ఇంచార్జి గంగారపు స్వాతి పేర్కొన్నారు. బుధవారం మదనపల్లె జనసేన కార్యాలయంలో నిరహించిన మీడియా సమావేశంలో స్వాతి మాట్లాడుతూ కొందరు వాలంటీర్స్ ద్వారా వ్యక్తిగత డేటా ఇతురులకి చేరుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని మరియు కొందరు వాలంటీర్స్ చేసిన కొన్ని నేరాలు సాక్ష్యాలుగా ఉన్నాయని, ఆదారాలు లేకుండా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని గంగారపు స్వాతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డెమ్మ, అంజలి, ప్రభావతి, నారాయణమ్మ, నాగవేణి, రేణుక, ప్రమీల, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, సనా ఉల్లా, గడ్డం లక్ష్మిపతి, మదనపల్లి మండల రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.