టీమ్ పిడికిలి పోస్టర్స్ ప్రచారంలో వీరఘట్టం జనసేన

పాలకొండ: మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ టీమ్ పిడికిలి పోస్టర్స్ ప్రచారంలో బాగంగా పాలకొండ జనసేన పార్టీ నాయకులు, వీరహమహిళలు, జనసైనికులు జనసేన పార్టీ టీమ్ పిడికిలి పోస్టర్స్ స్టిక్కర్స్ ను ఆటోలకు అంటించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక ఏ విషయంలో ఏ పార్టీ దగ్గర కూడా జనసేన పార్టీ తగ్గే ప్రసక్తే లేదు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. జనసేన పార్టీ వీరమహిళ, కర్రీ కళ్యాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలుకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది అని జనసేన పార్టీలో మహిళలలను పవన్ కళ్యాణ్ గారు వీరామహిళలుగా గుర్తించారు అని అలాంటి నాయకులు కచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి అని అన్నారు. జరాజపు రాజు మాట్లాడుతూ చదువుకున్నా విద్యార్థులకి ఎలాంటి నోటిఫికేషన్ లేక విద్యార్థుల ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అని అన్నారు. ప్రెవేట్ ఉద్యోగాలు కోసం పక్క రాష్త్రాలకు వెళ్ళవలిసిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. రఘుమండల గణేష్ మాట్లాడుతూ.. 2024 లో జనసేన పార్టీకి యువత, రైతులు ప్రతి ఒక్కరు అండగాఉండాలి అని, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేన క్రీయాశీలక సభ్యులు హెచ్ జయశకర్, బి సందీప్, బి సతీష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.