30 వ రోజుకు చేరుకున్న పవనన్న ప్రజాబాట

★ డాక్టర్ కందుల ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం
★ ప్రజల నుంచి అనూహ్య స్పందన
★ డాక్టర్ కందుల నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రజలు

దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 30వ రోజుకు చేరుకుంది. నియోజకవర్గంలో సుమారుగా అన్ని వార్డులలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమం చేపట్టిన ప్రతిచోట ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. డాక్టర్ కందుల నాగరాజుకి మంగళ హారతితో స్వాగతం పలికి అతని నాయకత్వాన్ని బలపరిచారు. ఆయన వెంటే తాము ఉంటామని ప్రకటించారు. సోమవారం 36వ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అడుగడుగునా ప్రతి గడపకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించని స్పందన వస్తుందని తెలిపారు. జనసేన పార్టీ పట్ల ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరు గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో రానున్నది జనసేన ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు

★ పుష్పవతి అయిన అమ్మాయికి పట్టుబట్టలు
ఈ సందర్భంగా 36వ వార్డు ఆసిపాప వీధిలో పుష్పవతి అయిన శాంతి అనే అమ్మాయికి డాక్టర్ కందుల నాగరాజు పట్టు బట్టలు అందజేసి ఆమెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామకృష్ణ, నజీరా, లలిత, మంగ, జానకి, రాజేశ్వరి, హేమ, కుమారి తదితరులు పాల్గొన్నారు.