జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి: యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో మహా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు డిఆర్డిఏ రాష్ట్ర మాజీ అధికారి రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం రాజంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద మహా రక్తదాన శిబిరం ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నామని కావున రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లి, సుండుపల్లి, మండలాలలోని జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ మేరకు సోమవారం రాజంపేటలో రక్తదాన శిబిరం పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, పివిఆర్ కుమార్, నాసిర్ ఖాన్, సింగంశెట్టి సూరి, పత్తి వెంకటసుబ్బయ్య, ఒంటేరు రాజా, షేక్ మున్న, ఒంటిమిట్ట కట్ట మల్లికార్జున, సురేష్, నందలూరు గురివిగారి వాసు, ఈశ్వర్, గోపి, మౌలా, కట్టారు బాబు, రాజా ఆచారి, తేజ, మీసాల నారాయణ, చిట్టే భాస్కర్, రాజంపేట మెగా ఫ్యాన్ అధ్యక్షుడు పలుకూరి శంకర్, లతీఫ్, యూత్ నాయకులు తేజ, భీమనేని నాని, తోట సురేష్, సాంబ రరాజా, రవిశెట్టి, గుగ్గిళ్ళ గంగాధర్, మున్నా, వీరబల్లి పవన్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.