జాని మాష్టారుని కలసిన ఉప్పు వెంకటరత్తయ్య

జనసేన పార్టి ప్రచారకర్త ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాష్టారుని శనివారం క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టి కార్యకర్తల సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య కలవటం జరిగినది. ఈసందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, మరియు ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడానికి జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బిజెపి నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులు ఘనవిజయం సాదించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.