జనసేన పార్టీ విజయం

  • జనసేన దరఖాస్తుకు స్పందించిన మున్సిపల్ అధికారులకు ధన్యవాదములు

భైంసా: గత కొద్ది రోజుల క్రితం భైంసా పట్టణంలోని గ్రంథాలయం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన నాయకులు వినతి పత్రం సమర్పించగా.. వెంటనే స్పందించి, అపరి శుభ్రంగా వున్న చెత్త చెదారాన్ని, ఏపుగా పెరిగిన చెట్లను, టాక్టర్ తో క్లీన్ చేయించిన మున్సిపల్ అధికారులకు జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, జనసేన యువజన సంఘం నాయకులు శేఖర్, గ్రంథాలయ అధికారి, విద్యార్థులు దీపక్, శ్రావణ్, రాకేష్, సాయి కిరణ్ లు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వసతుల కోసం జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.. వాటిని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేసారు.