మంచినీటి సరఫరాకు నోచుకోని విజయరాయుడుపాలెం – పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి తొమ్మిదవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. చంద్రుడు దగ్గరకు రాకెట్ ను పంపగల అధునిక యుగంలో మనం ఉన్నా కూడా గ్రామలకు మంచి నీటి సదుపాయం అందిచలేని ప్రభుత్వంఎందుకు అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధికి నోచుకోని విజయరాయుడుపాలెం చూసి వైసిపి పాలనలో అభివృద్ధి అనేది శిలాపలకానికే పరిమితం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.