Srikalahasti: ముంపు ప్రాంతాల ప్రజలకు భోజనాలందించిన వినుత కోటా

ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తక్షణ సహకారం అందించాలి

శ్రీకాళహస్తి నియోజకవర్గం, గడిచిన 2-3 రోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న బారీ వర్షాల వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అనేక గ్రామాలు నీట మట్టం అయ్యాయి. శ్రీకాళహస్తి మండలం వేడం ST కాలనీ, రామాపురం ST కాలనీ గ్రామాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించి వారికి భోజనం అందించిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. గ్రామాలలోని ప్రజలు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ముంపుకి గురి కాబడ్డ ప్రాంతాల్లో అందించడంలేదని తెలిపారు. రోజువారీ కూలికి వెళ్లి జీవనాధారం సాగించే అనేక మంది పేదవారు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారని శ్రీమతి వినుత దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటించినా అత్యవసర ఆర్థిక సహకారం కూడా ఎవరికీ అందలేదని, తక్షణమే జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు అండగా నిలబడాలని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీమతి వినుత కోటా కోరారు.