Gurajala: విశాఖపట్టణ ఉక్కు కార్మికుల సభను విజయవంతం చేయాలి

జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట పార్లమెంట్ ఇన్చార్జి నయబ్ కమల్ గురజాలలో పర్యటించారు. స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో జనసేన పార్టీ నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 31 వ తేదీన విశాఖపట్టణంలో ఉక్కు కార్మికులకు అండగా జరగబోతున్న పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభకు గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు జనసైనికులు అందరూ తరలి రావాలని ఆయన కోరారు. త్వరలో జరగబోయే గురజాల దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో జనసేనపార్టీ తరపున పోటీచేసి అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని, ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో, ప్రభుత్వం ఉందని, ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు కొర్రపాటి, నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, మల్లి, సంయుక్త కార్యదర్శులు, దుదేకుల ఖాసీంసైదా, షరీఫ్ నాయకులు మదీనా, పసుమర్తి మణి, ప్రసాద్, సలీమ్, నాగేంద్రబాబు, చిన్ని, అశోక్, కోటేశ్వరరావు, నరసింహారావు, వినోద్ సుభాని తదితరులు పాల్గొన్నారు.