ముద్దు పెట్టే అన్న వద్దు.. ముద్ద పెట్టే అన్న కి ఓటెయ్యండి..!

ముద్దు పెట్టే అన్న వద్దు.. ముద్ద పెట్టే అన్న కి ఓటెయ్యండి అంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మను క్రాంత్ చెన్నారెడ్డి సారధ్యంలో.. నెల్లూరు జిల్లా మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి ఆద్వర్యంలో.. మహిళా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో జరిగింది. దాదాపు వంద మంది మహిళలు సమావేశమైన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు, కరెంటు చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయని వీటిపై మహిళలు నిరసనలు చేపట్టాలని.. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న ప్రభుత్వం దాని ఊసే లేదని.. గతంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా మొదలైన మద్యపాన నిషేధం ఉద్యమం రాష్ట్రమంతా కదం తొక్కేటట్లు చేసిందని గుర్తు చేస్తూ.. జనసేన పార్టీ తరఫున మహిళలపై జరుగుతున్న అగడాలను ప్రతిఘటించాలని వారికి అండగా జనసేన పార్టీ నాయకులు తోడుగా నిలబడతారని తెలిపారు.

రాష్ట్రం అభివృద్ధి పడాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని.. దానికనుగుణంగా అందరూ పని చేసుకోవాలని నిర్దేశించారు.
ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలు, ముఖ్య నాయకులతో అతిథులుగా విచ్చేసిన మహిళా కన్వీనర్ రావి సౌజన్య, బి పార్వతి నాయుడు, బొందుల శ్రీదేవి మరియూ జిల్లా కమిటీ సభ్యులు సుకన్య, సిందూర, రాధమ్మ, గునుకుల కిషోర్, దుగ్గిసెట్టి సుజయ్ తీగల చంద్రశేఖర్, పూసల మల్లేశ్వరరావు, సిద్దు నరేష్ సుకన్య, ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి, మొద్దు పెంచలయ్య, వీరమహిళ వెంగమ్మ, అనంతసాగరంమండల అధ్యక్షులు మస్తాన్, జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.