సయ్యద్ జిలాని చేతుల మీదుగా వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

నరసరావుపేట : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 14న వారాహి యాత్ర చేపట్టనున్న సందర్భంగా సోమవారం నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ జిలాని చేతుల మీదుగా వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని బరంపేటలోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్ద చెరువులోని జాన్ పాడ్ దర్గా లో మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమం లో నరసరావుపేట నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అందరూ పాల్గొన్నారు.