జనసేన ఆద్వర్యంలో రామేశ్వరానికి వాటర్ ట్యాంకర్

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బందిపడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచి నీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం రామేశ్వరం గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి జనసేన నాయకులు సఖీనేటిపల్లి మండల జనసేనపార్టీ అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్ ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా రామేశ్వరం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామేశ్వరం జనసైనికులు పాల్గొనడం జరిగింది.