జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వాటర్ ట్యాంకర్

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బందిపడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచి నీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా మంగళవారం సఖినేటిపల్లి గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి జనసేన నాయకులు నామన నాగభూషణం(చిరుపవన్ సేవాసమితి వ్యవస్థాపకులు) కూతురు నామన దీక్షిత పుట్టినరోజు సందర్బంగా ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా సఖినేటిపల్లి జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.