ఎవ్వరికి టికెట్ వచ్చినా గెలిపించే బాధ్యత మనపై ఉంది: నిమ్మల నిబ్రమ్

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం టీడీపీ నాయుకులు నియోజకవర్గం ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ నియమించిన ముఖ్య సమావేశంలో పాలకొండ నియోజకవర్గ జనసేన-టీడీపీ నాయుకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన నాయుకులు పాలకొండ నియోజకవర్గం సమన్వయకర్త నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా పాలకొండ నియోజకవర్గంలో జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా ఎవ్వరికి టికెట్ వచ్చినా గెలిపించే బాధ్యత మన నియోజకవర్గ ప్రజలు అందరిపైన ఎంతో ఉంది అని ఈ సందర్బంగా తెలియజేయ్యడం జరిగింది. ఈ రాష్ట్రములో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వం బలోపేతం కావాలి. ప్రజా పరిపాలన రావాలి అంటే జగన్ నియంతపాలనకి ముగింపు పలకాలని జనసేన-టీడీపీ పొత్తు విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని నిబ్రమ్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ జనసేన మండల నాయుకులు పట్టణ నాయుకులు గ్రామ నాయుకులు పాల్గొన్నారు.