అన్నమయ్య వరద బాధితులకు అండగా ఉంటాం

  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: అన్నమయ్య డ్యాం వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం వరదబావిత ప్రాంతాలైన తొగురుపేట గ్రామంలో ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించారు. గ్రామవాసులు ఇంతవరకు వైసిపి ప్రభుత్వం హామీలు ఇచ్చారు తప్ప మాకు న్యాయం జరగలేదని ఆయనకు వివరించారు. ఈసందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం దాచుకోవడం, దోచుకోవడమే తప్ప ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి మొదటి ప్రాధాన్యతగా అన్నమయ్య డ్యాం వరద బాధితులకే న్యాయం జరిగేలా చూస్తామని గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.