పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, గడువులోగా సమస్యలు పరిష్కారించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అధికారులను హెచ్చరించారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలం కోళ్ళుబైలు పంచాయతీ బృందావన్ కాలనీ, బయారెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ వాసులతో కలిసి ఎంపిడిఓ తాజ్ మాస్రూర్ కు వినతిపత్రం అందించారు. కాలనీలు ఏర్పడిన నాటి నుండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇటీవల జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, జనసైనికులు, వీరమహిళలు గుర్తించారు. ‌ముఖ్యంగా నీటి సమస్య, రోడ్లు, డ్రెయినేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ‌దీనిపై జనసేన పార్టీ ఆద్వర్యంలో ఎంపిడిఓ తాజ్ మస్రూర్ కు విన్నవించారు. స్పందించిన ఎంపిడిఓ తక్షణమే నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, ఐటి విభాగం జగదీష్, రెడ్డెమ్మ,కుమార్, లక్ష్మీపతి కాలనీ వాసులు పాల్గొన్నారు. ‌