దసరా ఉత్సవాలలో పాల్గొన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముందుగా భోగాపురం గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద లక్ష కుంకుమార్చనలో పాల్గొని పూజలు నిర్వహించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహుమతులను భక్తులకు బహూకరించడం జరిగింది. అనంతరం చేబ్రోలు, గొల్లప్రోలు మరియు దుర్గడా గ్రామాలలో వివిధ కమిటీల అధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమలకు జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమలలో ఉత్సాహంగా పోల్గొని గ్రామస్థులతో కలిసి వడ్డిస్తూ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ వారి దయ, కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక భవానీ మాలధారణ చేసిన భక్తులుతో పూజ విధానాలు గురించి చర్చించి వారి కొరకు ఏర్పాట్లు చేసిన భిక్ష సేవాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు మరియు స్థానిక నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.