విక్కుర్తి అంజనేయులు కుటుంబానికి అండగా ఉంటాం: బోనబోయిన, గాదె

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి బలైన విక్కుర్తి ఆంజనేయులు కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యాక్షులు అడపా మాణిక్యాలరావు పరామర్శించి.. ఆంజనేయుల చిత్రాపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. కలెక్టర్.. రెవిన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తన ప్రాణాలు పోగొట్టుకున్నాడని.. బోనబోయిన అన్నారు. అధికారులను తక్షణమే విధులనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారూ.

గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం చెయ్యాల్సిన అధికారులు…. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ… చివరకు ప్రాణాలు తీసే స్థాయికి దిగజరిపోయారని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.. ఇది ఆత్మహత్య కాదని పూర్తిగా ప్రభుత్వ అధికారులు చేసిన హత్యేనని.. విక్కుర్తి ఆంజనేయులు కుటుంబానికి త్వరగా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.. భవిష్యత్ లో ఆ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుందని హామీ యిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, యర్రంశెట్టి వేణు, యర్రంశెట్టి సూర్యనారాయణ,శిఖా బాలు, యుగందర్, గంగరాజు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-20-at-2.10.17-PM-1024x768.jpeg