టి.డి.పి, జనసేన, బిజెపిల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల మండలం, పాపంపేట గ్రామంలో శనివారం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మెరుగైన అభ్యర్థులను ఎంచుకోవాలని యువకులకు వివరించడం జరిగింది. తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు రంపచోడవరం నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి, అరకు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, కట్ట ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.