చీపురుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు

చీపురుపల్లి నియోజకవర్గం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా బుధవారం గెడ్డపువలస గ్రామంలో సుమారు 300 మందితో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకి సన్మానం చేయడం జరిగింది. మహిళలని ఉదేశించి మహిళ తాలూకా ప్రాముఖ్యత స్త్రీశక్తి గురించి ఉపన్యాచడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నాయకులు తుమ్మగంటి సూరి నాయుడు మరియు నాయుడు జనసేన, గెడ్డపువలస బోర్డు మెంబర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.