కనకపూర్ణ చంద్ర రావు కుటుంబానికి యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శ

  • పార్టీ తరఫున రూ.10000 ఆర్ధిక సాయం

పెడన: కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన గూడూరు కనక పూర్ణ చంద్రరావు స్థానిక శివాలయంలో అర్చకులుగా పని చేస్తున్నారు. ఇటీవల షుగర్ వ్యాధి రావడంతో తన రెండు కాళ్ళు సరిగా పని చేయక, ప్రస్తుతం సరిగా నడవలేని స్థితిలో ఉన్నారు. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆదివారం కప్పలదొడ్డి గ్రామంలోని పూర్ణ చంద్రరావు ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందచేసి, పూర్ణ చంద్రరావు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని, స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, గుడివాడ రమేష్, సుంకర అంజి బాబు, కొఠారి ఫని కుమార్, దాసరి నాగ సాయి, నరహరి సెట్టి ప్రసాద్, సింగంసెట్టి అశోక్ కుమార్, కొఠారి మల్లి బాబు, గడ్డిగోపుల నాగ, కొలపల్లి శ్రీకాంత్, నందం శివ స్వామి, బాదం వినోద్, దారపు రెడ్డి నవీన్ అంజి బాబు, పవన్ పాల్గొన్నారు.