వారాహి యాత్ర విజయవంతంతో వైసీపీ నాయకులకు మతి భ్రమించింది

  • పైలా నరసింహయ్య వ్యాఖ్యలను ఖండించిన కుందుర్తి నరసింహా చారి

తాడిపత్రి: అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ను మానసిక రోగి.. ఒక్క చోట కూడా గెలవలేదని.. సీఎం కాలేదని ఏద్దేవా చేస్తూ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి స్పందిస్తూ.. గెలుపు ఓటములు ఎన్నికల్లో సహజమని, అయినా ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక్కో నియోజకవర్గంలో రూ 250 నుంచి రూ 350 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం నీచమైన చర్య అని, ఇలాంటి గెలుపు మాకు అవసరం లేదని, ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో చేరువ కావడానికి ముందు తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని కొనియాడారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీ నాయకులకు, ముఖ్యమంత్రికి మతి భ్రమించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దయ్యబట్టారు. 2024 ఎన్నికల్లో ప్రజలు జనసేనకు అండగా నిలుస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడం తద్యం అని జోస్యం చెప్పారు. ఇక వైఎస్సార్సీపీ నీ ప్రజలు వైకుంఠ రథం మీద అంతిమ యాత్ర చేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు.