ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్న వైసీపీ: శివదత్ బోడపాటి

రాష్ట్రంలో మరోసారి పేద ప్రజలను మోసం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తూదని బియ్యం తీసుకుని వారికి నగదు అనే విధానం ద్వారా పేద ప్రజల పొట్టకొట్టాలని చూస్తున్నారని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ విమర్శించారు. గతంలో అధిక కరెంట్ బిల్లు వచ్చాయని, ఐటీ రిట‌న్ కడుతున్నారని కారు, వ్యాను ఉందని సాకులు చూపి వేల కుటుంబాల రేషన్ కార్డులు తొలిగించి వారి పొట్ట కొట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఇపుడు మరలా.. బియ్యం తీసుకొని వారికి నగదు అని చెప్పి 1,2 నెలలు ఇచ్చాక బియ్యం తీసుకోని వారందరికీ రేషన్ కార్డులు తొలగించి, వారికి ప్రభుత్వ పథకాలు ఏమి చెందకుండా చెయ్యాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని పాయకరావుపేట నియోజవర్గం జనసేన నాయకులు బోడపాటి శివదత్ తెలియజేసారు. మా నాయకులు పిలుపు మేరకు ఎంతటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా వున్నామని ఈ సందర్భంగా కోటవురట్ల మండలం యువ నాయకులు శీను తెలియజేసారు.