వైసీపీ విశాఖ గర్జన సభ అట్టర్ ప్లాప్: ఎస్.వి.బాబు

  • దెబ్బతో వైసిపి మంత్రులకు మైండ్ బ్లాక్ అయింది
  • వీళ్ళ దుర్మార్గాన్ని ప్రకృతి కూడా వ్యతిరేకించడం జరిగింది
  • జోగి రమేష్ కి నా బహిరంగ సవాల్

పెడన, పవన్ కళ్యాణ్ ని విమర్శించడం తప్ప, మంత్రులు ఎవరు వికేంద్రీకరణ వల్ల ఉపయోగం చెప్పలేకపోయారు. మట్టి దొంగ మంత్రి జోగి రమేష్, దొంగే.. దొంగ.. దొంగ.. అని అరిచినట్లు యధావిధిగా పవన్ కళ్యాణ్ పై అర్థంపర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నట్లు నిరూపించు? లేదా పవన్ కళ్యాణ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు ఒక మట్టి దొంగ అని, భూ బకాసురుడు అని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. నా సవాల్ స్వీకరించే దమ్ము, ధైర్యం ఉంటే పెడన నియోజకవర్గ ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని పెడన నియోజకవర్గ జనసెన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.