జనసైనికుడిపై వైస్సార్సీపీ కార్యకర్తల దాడి

విజయనగరం, సోమవారం అర్ధరాత్రి విజయనగరం పట్టణంలో.. ధర్మపురిలో వైస్సార్సీపీ నాయకుని భూకబ్జాపై పోరాటం చేస్తున్న జనసైనికులు గౌరీశంకర్ పై వైస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది.

గాయపడిన గౌరీశంకర్ ప్రభుత్వ మహారాజ హాస్పిటల్ ల్లో వైద్యం తీసుకుంటున్న క్రమంలో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ విజయనగరం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు), మిడతాన రవికుమార్ మంగళవారం గౌరీశంకర్ ను పరామర్శించి.. సమస్యపై ఆరాతీసి, న్యాయబద్దంగా ముందుకు వెళ్లేందుకు అండగా ఉంటామని జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.