స్వాతంత్య్ర సమరయోధుడు పుల్లెల శ్యామసుందర్ పేరుతో నామకరణం

ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం మున్సిపాలిటీకి అనుసంధానమైన రైల్వే గేటు ఇబ్బందులని గతంలో ఫిబ్రవరి 6వ తేదీన జనసేనపార్టీ తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దానిపై ఎటువంటి కార్యాచరణ జరుగలేదు సుమారు రెండు నెలలు దగ్గర అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యని పరిగణనలోకి తీసుకుపోవడం వల్ల ఆదివారం జనసేనపార్టీ ఆఫీసులో మండల, మున్సిపాలిటీ నాయకులతో అత్యవసరసమావేశం ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 9వ తేది అనగా ఆదివారం స్థానిక ప్రజలు, మండల, మున్సిపాలిటీ నాయకులతో కలిసి రైల్వే గేటు సమీపంలో జనసేన శాంతియుతంగా ప్రజల మద్దతుతో ధర్నా చేయడానికి నిశ్చయించుకున్నాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చాపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పుల్లెల శ్యామసుందర్ పేరుతో నామకరణం చేసి, అతని స్పూర్తితో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి నామకరణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం నిర్వహించినా స్వాతంత్య్ర సమరయోధుల పేర్లతో ప్రారంభిస్తారు కావున మేము కూడా అతని అడుగు జాడల్లో నడుస్తూ ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 9-30ని. నుండి 11-3౦ని.వరకు శాంతియుతంగా రాస్తా రోకో చేస్తూ, నిరసన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహారా మరియు జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, మరియు మున్సిపాలిటీ వార్డు ఇన్చార్జిలు మరియు ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు మండల నాయకులు పాల్గొనడం జరిగినది.