నరేంద్ర మోడీ సాదించిన కొత్త రికార్డు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డును సాదించారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోడీ కొత్త రికార్డు సొంతం చేసుకొన్నారు.  ప్రధాని మోడీ అధిగమించిన ఈ రికార్డు గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరిట ఉండేది. వాజపేయి రికార్డును అధిగమించిన మోడీ.. ఇక ఎక్కువ కాలం ప్రధాని పనిచేసినవారిలో నరేంద్ర మోడీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రసార భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 2268 రోజులు పదవిలో కొనసాగగా, ఈ గురువారంతో ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని అధిగమించారు. నరేంద్ర మోడీ 14వ ప్రధానిగా మే 26, 2014 ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ప్రధానిగా మే 30, 2019న పదవీ బాధ్యతలు చేపట్టారు.