నేటి బాలలే రేపటి పౌరులు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం బొడ్లపాడు ప్రాధమిక పాఠశాల ఆవరణలో బాలల దినోత్సవం సందర్భంగా బాల బాలికలతో జనసేన జానీ ముచ్చటించారు. అనంతరం బాల బాలికలకు స్వీట్స్ పచ్చిపెట్టి తదనంతరం వారితో ముచ్చటించి మాట్లాడుతూ చదువు మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది, సమాజంలో మంచి గుర్తింపునిస్తుంది కనుక నేటి బాలలే రేపటి పౌరులు అని మంచి విద్యాబుద్దులు నేర్చుకొని దేశానికీ మంచిపేరు తెచ్చే విధంగా మనం నడుచుకోవాలని, పెద్దలను తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ చిన్న వయసు నుంచే విద్యపట్ల సమాజం పట్ల పెద్దలు పట్ల గురువులు పట్ల మంచి ఆలోచన విధానం నేర్చుకొని మెరుగైన సమాజానికి పునాదులు వేసే విధంగా నడుచుకోవాలని పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ పిల్లలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.