నాగిరెడ్డి పల్లెలో ప్రచారంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నాగిరెడ్డి పల్లెలో జనసేన, బిజెపి, టిడిపి కూటమి బలపరిచిన రాజంపేట పార్లమెంటు మరియు అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇప్పుడు ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలని యల్లటూరు శ్రీనివాస రాజు పిలుపునిచ్చారు. సీనియర్ మైనారిటీ నాయకులు కమాల్ బాషా ఆహ్వానం మేరకు వారి నివాసంకు వెళ్లిన నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ టి సి చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, మాజీ నాగిరెడ్డిపల్లె సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాడపూరి హేమలత,మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మన్ యెద్దల సాగర్, జయచంద్రా రెడ్డి, సర్పంచ్ రాము, తోట శివశంకర్, శివారెడ్డి, సునీత వర్మ, నాగేశ్వరరావు, నరేంద్రరాజు, మురళి, ఆదినారాయణ, ఆకుల చలపతి, గురివిగారి వాసు, ప్రశాంత్ భారతాల, ప్రశాంత్ తిప్పాయపల్లె, సునీల్, వంశీ, నాని, కార్తిక్, జాని, వినయ్, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.