భూహక్కుల చట్టంలోని 27/2023ను రద్దు చేయాలి

ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక భూహక్కు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27 ఆఫ్ 2023 అనే చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ సమక్షంలో ధర్మవరం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ డి. నాగ సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, గొట్లురూ జీవి, దాము, తలారి ప్రతాప్, జయరాం, నత్తి శ్రీరామ్ రెడ్డి, చిలకం సుధాకర్ రెడ్డి భాష, రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.