జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 30వ రోజు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ముగ్గుల గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ‘జనంకోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’ 30వ రోజు విజయవంతంగా ముందుకు సాగింది. జనసేన నాయకులు ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనసేన శ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాల ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాపకింద నీరులా రాష్ట్రం నలుమూలలా ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని. జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో మట్ట వేంకటేశ్వరరావు, ముత్యాల హరీష్, రుద్రం కిషోర్, రుద్రం నాగు, నేదురి పోసి, దులం పండు, నేదురీ విఘ్నేష్, ఇంటి దుర్గాప్రసాద్, రుద్రం సూర్యగణేష్, నేదూరి సతీష్, రుద్రం గణేష్, ప్రగడ బుల్లి, బోడపాటి కరుణాకర్, రుద్రం వెంకటేష్, తన్నీరు సూర్య గణేష్, రావూరి దుర్గా ప్రసాద్, రుద్రం నగేష్, నగా రామదుర్గా, తుమ్మలపల్లి శ్రీనివాస్, పోతుల సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు, మండల నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.