పాయకరావుపేట జనసేన ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం

పాయకరావుపేట, 73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల గ్రామంలో గల శివాలయంలో జనసేన నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశం కోసం మంచి విషయాలు చర్చించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా జవ్వాది బద్రి, గోవిందు, బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము, చిన్నారులు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.