తాడిపత్రి పట్టణంలో జనసేనపార్టీ రక్తదాన శిబిరం ఏర్పాటు

తాడిపత్రి పట్టణంలో చిరంజీవి రాష్ట్ర యువత తరుపున అధ్యక్షుడు ఆటో ప్రసాద్ అధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ 51 వ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ 125 మంది పాల్గొన్నారు అందులో 80 మంది రక్తదానం చేశారు. వారికి పల్లు పళ్ళ రసాలు అందజేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా రక్తాన్ని ఆర్.డి.టి రక్త కేంద్ర నిధికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా తాడిపత్రి జనసేన పట్టణ అధ్యక్షుడు కుందుర్తి నరసింహాచారి పాల్గొని జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతుభారోసా యాత్రల గురించి ప్రజలకు తెలియ జేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ ప్రారంభించిన నాసేన కోసం-నావంతు అనే కార్యక్రమంలో అభిమానులు, జనసైనికులు పాల్గొని పార్టీకి క్రౌడింగ్ ఫండ్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జనసేనపార్టీ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు అచుకట్ల అల్తాఫ్, బుక్కపట్నం ఇమామ్ వలి, మంజునాథ, రబ్బానీ, మున్నా, శివకుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్, సాయి, మహేష్, నూర్, షాషా వలి, సాదిక్ మరియు అభిమానులు జనసైనికులు పాల్గొన్నారు.