Warangal: రైతుల పోరాటానికి దక్కిన గొప్ప విజయం: ఆకుల సుమన్

హనుమకొండ, రైతు సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ సంవత్సరాకాలంగా రైతులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు ఆ చట్టాలను రద్దు చేస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం నిజంగా ఇది రైతు పోరాటానికి దక్కిన గొప్ప విజయం అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ అన్నారు. జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతుల గురించి ప్రవేశ పెట్టే ఏ చట్టం అయిన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ముందు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ఇన్ని రోజులు రైతులు వ్యవసాయం చేయడం మానేసి రోడ్ల మీద ధర్నాలు చేయడం చాలా బాధాకరం, ఇకమీదట ఏ రైతు ధర్నా చేయకుండా రైతులకు అండగా ప్రభుత్వాలు వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.