బొర్రా ఆధ్వర్యంలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు

  • సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మరియు సత్తెనపల్లి రూరల్ మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

సత్తెనపల్లి: జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు నాయకత్వంలో.. సత్తనపల్లి పట్టణంలో, రూరల్ మండలంలో జనసేన పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేడుకలలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా.. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్, మరియు జనసేన పార్టీ వీరమహిళ నామాల పుష్ప, చిలకా పూర్ణ పుట్టిన రోజు సందర్భంగా వారి ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేపించిన బొర్రా వెంకట అప్పారావు అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు దుశాల్వాలతో, పూలదండలు, పుష్పగుచ్చాలతో బొర్రాను ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ.. ముందుగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బొర్రా.. ఈ నూతన సంవత్సరంలో ప్రజల జీవితాలలో నూతన వెలుగులు నింపాలని, యువత చెడు వ్యసనాలను విడనాడి, మంచి మార్గంలో నడవాలని, నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకొని విజయతీరాలకు చేరాలన్నారు..జనసేన పార్టీ -తెలుగు దేశం పార్టీల పొత్తుతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుంది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి పట్టణ ఏడో వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్, మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, పట్టణ నాయకులు, గ్రామ నాయకులు, వీరమహిళలు, తదితర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.