తాళ్లపూడి, కొత్తపాలెం ప్రజల సమస్యలపై గళమెత్తిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, తాళ్లపూడి కొత్తపాలెం పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు పర్యటించి ఆక్కడ స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో పవర్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే పొల్యూషన్ తో ఎంతో ఇబ్బందులు పడుతూ.. ఆ యొక్క వాయూ కాలుష్యాన్ని పీల్చుకోవడం వల్ల అనేక అనారోగ్యాలకి గురవుతూ ఉంటే.. కనీసం మంచి వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం శోచనీయం. అదే విధంగా ఏదైతే ఇల్లు లేని పేదలకు పూర్తిస్థాయిలో ఇంకా ఇల్లు నిర్మించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్బంగా బొబ్బేపల్లి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఈ పవర్ ప్లాంట్ లు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకి ఉచితంగా మంచి వైద్యం అందించాలని.. త్వరితగతిన ఇల్లు లేని వారికి పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గిరీష్ శ్రీహరి రవి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.