కళ్యాణదుర్గం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు మెంబర్షిప్ కిట్లు బుధవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలు వాడుకొనే పార్టీలున్న ఈ కాలంలో అన్ని పార్టీలకు డిఫరెంట్ గా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్ముకున్న వారికి వమ్ము చేయకూడదనే ఉద్దేశంతో ఏ పార్టీ చేయని విధంగా మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన నాయకుడు మనకు ఏమైనా జరిగితే మన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలనే గొప్ప సంకల్పంతో జనసేన సభ్యత్వం 500 కడితే ఐదు లక్షలు జీవిత భీమా పాలసీ, హాస్పిటల్ ఖర్చులకోసం ప్రమాద భీమా 50,000 రూపాయలను మనకు మన కుటుంబానికి మన జనసేన పార్టీ ద్వారా అందించడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు చేయడం లేదని ఆయన తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన దాదాపు 700 వందలు పైచిలుకు సభ్యత్వాలకు బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక కిట్లు, గాజు గ్లాసు, ఐడి కార్డు, నోటు పుస్తకం, ఒక బ్యాగ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఐటి టీం కోఆర్డినేటర్ రాఘవేంద్ర, జనసేన వీరమహిళ షేక్ తార, జనసేన నాయకులు మొహిద్దిన్, జాకీర్, వెంకటేశులు, కాంత, రాజ్, ముక్కన్న మారుతి, నీలకంఠ, నాగరాజు, సురేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.