బోనకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

మధిర బోనకల్ మండల కేంద్రంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజేపి అబ్దుల్ కలాం పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా బోనకల్ మండల అధ్యక్షుడు తాళ్లూరు డేవిడ్ తో పాటు విద్యార్థి విభాగం నాయకులు గంధం ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ మాతృభూమి సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి అబ్దుల్ కలాం భారతదేశ క్షిపణి పితామహుడు, మిస్సెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తూ దేశంలో వారి సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ జానీ పాషా, సహాయ కార్యదర్శి షేక్ బాజీ బాబా, దాసరి వంశీ, గూగుల్ హుస్సేన్, సండ్ర భూపతి రావు తదితరులు పాల్గొన్నారు.