అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి, వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఒక సామాన్య పేపర్ బాయ్ గా, ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా, మన దేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నో సేవలందించి యువతకి ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకొని యువత ఆ మహనీయుని బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ మహనీయుని ఆయన ముఖ్య ఉద్దేశమే నదులు కాదు, ఖనిజాలు కాదు వాటన్నిటి కంటే విలువైనది యువత భవిష్యత్తు మరి అటువంటి యువతని సరైన మార్గంలో నడిపించేది బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, రహమాన్, శ్రీను, సందీప్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.