జనసేనాని కుటుంబం సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి

  • సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సూర్యాపేట జనసేన నాయకులు

సూర్యాపేట: తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు రామగిరి శివసాయి ఆధ్వర్యంలో మరియు సూర్యాపేట నాయకులు స్థానికి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సూర్యాపేట నాయకులు గుడిసె గౌతమ్, లింగా నాయక్, వెలుగు గణేష్, దుబ్బ క్రాంతి, సూరారపు సాయికుమార్, మనీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.