జనసేన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ఆదాడ

విజయనగరం: జనసేన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు కంటోన్మెంట్, ఎల్.బి నగర్లో శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎం.ఎల్.సీ. పాలకలపాటి రఘు వర్మ, యువనేత గురాన అయ్యులు, జనసేన నాయకులు జమ్ము ఆదినారాయణ, విసినిగిరి శ్రీనివాసరావు, ఎం.సత్యనారాయణ మాస్టారు, రౌతు సతీష్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నాయకులు ఎం.ఎల్.సీ.రఘు వర్మ, యువ నాయకుడు గురాన అయ్యాలు కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన రఘువర్మ మాట్లాడుతూ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించి, వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తగుసహాయం చేయడంలోనే ప్రేమకు ప్రతిరూపమైన నేను ఉన్నానని ఏసుక్రీస్తు మాటలనును గుర్తుచేస్తూ.. మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుందని, చెడు చేస్తే మనకి చెడు జరుగుతుందని అంటూ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహనరావు, జమ్ము ఆదినారాయణ, విశినిగిరి శ్రీనివాసరావు, రౌతు సతీష్, ఎం. సత్యనారాయణ, యువనేత గురాన అయ్యలు మాట్లాడుతూ.. ఏ మతమైనా ప్రేమను పంచమంటుందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, నీతిగా, నిజాయితీగా ముందుకు వెళ్లేవారికి కష్టాలు తప్పవని వారికి భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని వక్తలు ప్రసంగించారు. అనంతరం వచ్చిన అతిథులకు ప్రేమవిందును ఏర్పాటు చేశారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ మోజేస్ ప్రత్యేక సందేశాలను, ప్రార్థనలను నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీగా జనసేన నాయకులు హాజరయ్యారు.