గణతంత్ర వేడుకల్లో… అమలాపురం జనసేన కౌన్సిలర్

తూర్పుగోదావరి, అమలాపురం 9వ వార్డు ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఘాన్సీ లక్ష్మి బాయి ప్రాథమిక పాఠశాలలో జనవరి 26వ తేదీ బుధవారం నాడు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయపతాకం ను వార్డు జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి వాసు ఎగరవేసి, గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్ఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు నల్లా ఈశ్వరుడు, నల్లాచిన్ని, తదితరులు పాల్గొన్నారు.