మహనీయునికి అమలాపురం జనసేన అశ్రునివాళి
డా.బి.ఆర్.అంబేద్కర్ కొనసీమ జిల్లా ప్రఖ్యాత సినీ దిగ్గజం, మాజీ పార్లమెంట్ సభ్యులు, సూపర్ స్టార్ కృష్ణ మరణానికి చింతిస్తూ అమలాపురం జనసేన పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. స్థానిక గడియార స్తంభం వద్ద జనసేన పార్టీ పక్షాన ఆయన కుమారుడు మహేష్ బాబుకి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమాహేశ్వరరావు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్.డి.యస్.ప్రసాద్, పడాల నానాజీ, వాకపల్లి వేంకటేశ్వరరావు, కడియం సందీప్, బండారు వెంకన్న బాబు, నల్లా వెంకటేశ్వరరావు, పప్పుల నానాజీ, కంకిపాటి గోపి, సాధనాల మురళి, నిమ్మకాయల రాజేష్, గంధం శ్రీను, అల్లాడ రవి, లింగోలు శ్రీనివాస్, సలాది కన్నా, షఫీ, కరీముల్లా బాబా, తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, కర్రి లక్ష్మి దుర్గ, కరాటం వాణి, వానపల్లి దేవి, పడాల కళ్యాణ్, పోలిశెట్టి మహేష్, పరమట చిట్టిబాబు, యాళ్ళ సురేష్, జానపాటి చిరంజీవి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.